BEL Recruitment 2021: Bharat Electronics Limited Invites Job Application from Eligible Candidates

1 1

ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ అఫ్  డిఫెన్స్ కి చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) కంపెనీ జాబ్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కంపెనీ యొక్క హైదరాబాద్‌ యూనిట్‌లో ఖాళీగా ఉన్న 49 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, మరియు ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ రిలీజైంది. ఈ పోస్టులని కాంట్రాక్ట్‌ పధ్ధతిలో భర్తీ చేయనున్నారు. అయితే, ఈ పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక అనేది వారి అకడమిక్‌ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు. మిగిలిన వివరాలు ఇలా ఉన్నాయి.

 

మొత్తం ఖాళీలు: 49

కంపెనీలో ఉన్న ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల్లో భాగంగా ఎలక్ట్రానిక్స్‌  విభాగంలో 36 పోస్టులు, మెకానికల్‌ విభాగంలో 8 పోస్టులు, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో 4 పోస్టులు, హ్యూమన్‌ రిసోర్సెస్‌ విభాగంలో 1 పోస్టు ఖాళీలున్నాయి.

విద్యార్హతలు: 

పోస్టులను బట్టి ఇంజనీరింగ్ లో… బీఈ/బీటెక్‌/బీఎస్సీ, హ్యూమన్‌ రిసోర్స్‌ స్పెషలైజేషన్‌లో… ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ/ఎంహెచ్‌ఆర్‌ఎం/ఎంఏ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఆయా విభాగాలలో రెండేళ్ల అనుభవం కూడా తప్పనిసరి.

వయసు: 

అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్లని బట్టి  సడలింపులు ఉంటాయి.

ఎంపిక విధానం: 

అభ్యర్థుల ఎంపిక అనేది అకడమిక్‌ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు.

వేతనం: 

ప్రారంభ వేతనం రూ.35,000 ఉంటుంది. ఏడాది తర్వాత రూ.5 వేల చొప్పున పెంచుతారు.

దరఖాస్తు విధానం: 

ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: 

ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాలంటే… అప్లికేషన్‌ ఫీజు రూ. 500 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తులకు చివరితేది: 

ఆగస్టు 4, 2021

వెబ్‌సైట్‌:

https://bel-india.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

1 2

ప్రతి నెలా అదనంగా రూ.50 వేలు సంపాదించే బిజినెస్ ఐడియా!ప్రతి నెలా అదనంగా రూ.50 వేలు సంపాదించే బిజినెస్ ఐడియా!

కరోనా మహమ్మారి పుణ్యమా అని ఉన్న ఉద్యోగాలు పోయాయి. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. మొత్తం ఆర్దికవ్యవస్థే చిన్నాభిన్నం అయిపొయింది. ఈ నేపద్యంలో ఉన్న ఆదాయం సరిపోవడం లేదు. మరి అలాంటప్పుడు అదనపు ఆదాయం కోసం ప్రయత్నించక తప్పదు. ఈ క్రమంలోనే ‘వర్క్ ఫ్రమ్

4

స్టార్టప్స్ కి రూ.10 లక్షలు లోన్ ఆఫర్ చేస్తున్న ప్రధాని మోదీస్టార్టప్స్ కి రూ.10 లక్షలు లోన్ ఆఫర్ చేస్తున్న ప్రధాని మోదీ

కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్న స్టార్టప్స్ కి మోదీ గవర్నమెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ని అందించాలని భావించింది. అందుకోసం ఓ సరికొత్త స్కీమ్ ని అందుబాటులో ఉంచింది. దాని పేరే ‘ముద్రా యోజన’. ఈ స్కీమ్ కింద