టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ ప్రస్తుతం మనిషి జీవితంలో భాగమైంది. కేవలం AI టూల్స్ ని ఉపయోగించి అనేక అద్భుతాలు సృష్టించవచ్చు.
అది ఒక కళాకారుడు ప్రయత్నిస్తే ఊహకందని వాస్తవం. ఈ టెక్నాలజీ ఉపయోగించి తన సామర్ధ్యాన్ని పెంపొందించుకోవచ్చు.
సెలెబ్రిటీల నుండీ సామాన్యుల వరకూ ఏ ఒక్కరినీ ఒదిలిపెట్టట్లేదు. క్రియేటివిటీ ఉండాలి కానీ సాధ్యం కానిదంటూ ఏదీ లేదు.
SK MD అబూ సాహిద్ అనే ఒక ఆర్టిస్ట్ భారతీయ క్రికెటర్లను వృద్ధులుగా చిత్రీకరించారు. క్రికెట్ లవర్స్ కి ఇదో షాకింగ్ ఇన్సిడెంట్.
అందుకోసం ఆయన మిడ్జర్నీ అనే AI టూల్ ని ఉపయోగించారు. తాను రూపొందించిన కళాకృతులను అగ్రశ్రేణి క్రికెటర్లకు అంకితం చేశా రు.
ఆర్టిస్ట్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ పోస్ట్ను పంచుకున్నారు. దానితో పాటు అతను ఇలా రాశాడు.
అతను ఇలా రాశాడు. "AI భారత క్రికెటర్లను వృద్ధులుగా చిత్రీకరిస్తుంది. మిడ్జర్నీ AIని ఉపయోగించి రూపొందించిన చిత్రాలు ఇవి అని.
ఈ AI ఆర్ట్ సిరీస్ ఆన్లైన్లో సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఇవి ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.